ఏపీ ఫైబర్‌కి, లోకేష్‌కి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధమే: వేమూరి

మాజీ సీఎం చంద్రబాబు విజన్ లో భాగంగా ప్రతీ గ్రామానికి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించేందుకు తనను ఐటీ సలహా దారుగా నియమించారని

ఏపీ ఫైబర్‌కి, లోకేష్‌కి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధమే: వేమూరి
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 1:22 PM

Vemuri Hari Prasad: మాజీ సీఎం చంద్రబాబు విజన్ లో భాగంగా ప్రతీ గ్రామానికి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించేందుకు తనను ఐటీ సలహా దారుగా నియమించారని ఏపీ ప్రభుత్వ ఐటీ మాజీ సలహాదారు వేమూరి హరిప్రసాద్‌ అన్నారు. 2015లో టెండర్లు అనౌన్స్ చేసినప్పుడు టెక్నికల్ కమిటీలో తాను ఒక మెంబర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అప్పుడు నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయని. తెరా సాఫ్ట్ వేర్ కంపెనీ టెండర్ దక్కించుకుందని తెలిపారు. ఆ తెరా కంపెనీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐటీకి సంబంధించిన వాడిగా తనకు అన్ని కంపెనీల వారు తెలుసని పేర్కొన్నారు.

ఇక సెట్‌ ఆఫ్ బాక్స్‌కి సంబంధించిన టెండర్‌ని డాసన్ అనే కొరియన్ కంపెనీ దక్కించుకుందని .. ఈ కంపెనీ 90శాతం సప్లై చేస్తే, మిగిలిన కంపెనీలు మరో పది శాతం సప్లై చేశాయని వివరించారు. 3700రూపాయలకు మూడు సౌకర్యాలు ఒకే బాక్స్ లో ఉండేలా ఈ కంపెనీ సెట్ ఆఫ్ బాక్స్‌లు అందించిందని పేర్కొన్నారు. అధిక ధరలకు సెట్‌ ఆఫ్ బాక్స్‌లు కొనుగోలు చేశామన్నది అవాస్తమవని తెలిపారు.

700కోట్ల రూపాయల మాత్రమే ఏపీ ఫైబర్‌లో ఖర్చు చేస్తే 2000కోట్ల స్కామ్ చేశారని చెప్పడం ఏంటో ఆర్దం కావడం లేదని వేమూరి హరిప్రసాద్ ప్రశ్నించారు. రాజకీయం కోసం అవాస్తవాలతో ఆరోపణం చేయడం సరికాదని.. ఎవరు ఎక్కడకు పిలిచినా, వివరణ ఇవ్వడానికి సిద్ధమని అన్నారు. 92శాతం డిస్కౌంట్‌కి, నెట్ కంపెనీలను అప్పటి సీఎం ఒప్పించారని, ఇంత తక్కువ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ చేపట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. టెండర్ ప్రక్రియలో తాను ఎప్పుడూ భాగస్వామ్యం కాలేదని పేర్కొన్నారు. దీని వలన ఈ రాష్ట్రానికి ఎంత లాభం చేయగలుగుతారు అన్న అంశంపై మాత్రమే కంపెనీలతో మాట్లాడానని చెప్పుకొచ్చారు.

ఆరోపణలు చేస్తున్న మంత్రికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి ఎంక్వైరీ చేసినా ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు. తప్పు చేసినట్లైతే శిక్షించొచ్చని.. తనను టార్గెట్ చేయడం వలన చంద్రబాబు, లోకేష్‌ని ఇబ్బంది పెట్టాలనుకోవడం సరైనది కాదని అన్నారు. ఏపీ ఫైబర్‌కి లోకేష్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

2012 తెరా మీడియా సొల్యూషన్స్ పేరుతో తన స్నేహితులు కంపెనీ ప్రారంభించారని, అందులో తనను డైరెక్టర్ ఉండమన్నారని తెలిపారు. అయితే ఆ కంపెనీలో తాను ఒక్కరోజు కూడా పనిచేయలేదని, ఆ తరువాత ట్రాన్సాక్షన్ లేక ఆ కంపెనీ మూతపడిందని చెప్పుకొచ్చారు. నెట్ ఇండియా కంపెనీకి, ఏపీ ఫైబర్‌కి ఎలాంటి సంబంధం లేదని హరి ప్రసాద్ వెల్లడించారు.

Read More:

‘వెబ్‌ సిరీస్’‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి

షో తరువాత చాలా కోల్పోయాం.. ‘బిగ్‌బాస్’‌పై మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు