AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ మహా నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధి అంబర్‌పేట జంక్షన్ వద్ద

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 6:54 PM

Share

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ మహా నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధి అంబర్‌పేట జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. 202వ నెంబరు జాతీయ రహదారిపై అంబర్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద ఓ ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రెండేళ్ల క్రితం 2018లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ కోసం అప్పటి అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.76.33 కోట్లు నిధులు సైతం మంజూరు చేసిందని లేఖలో గుర్తు చేశారు. భూ సేకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున జీహెచ్ఎంసీ ద్వారా రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టి, సంబంధిత కాంట్రాక్టర్‌కు నిర్మాణం నిమిత్తం భూమిని ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉందని కిషన్ రెడ్డి లేఖ ద్వారా వివరించారు. కాంట్రాక్ట్‌ నిర్ణయించి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా ఇంకా స్థల సేకరణ పూర్తికాలేదని అన్నారు. ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌పై దృష్టి పెట్టి వెంటనే స్థల సేకరణ పూర్తిచేసి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు.