AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కోనసీమలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..
Ravi Kiran
|

Updated on: Jun 03, 2020 | 6:58 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కోనసీమలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల 21వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో నమోదైన కరోనా పాజిటివ్ మరణం సూపర్ స్పైడర్‌గా మారింది.

ఆ మరణం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఏకంగా 157 మందికి కరోనా సోకగా.. ఆ ఒక్క గ్రామంలోనే 117 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ వైరస్ వ్యాప్తి ఆ ఊరిలోని ఓ హోటల్‌ను లాక్ డౌన్ సమయంలో ఓపెన్ చేయడం వల్లే జరిగిందని అధికారుల విచారణలో తేలింది. దీనితో గొల్లల మామిడాడ గ్రామంలోని 21 వేల జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 3,200 నమోదు కాగా, అందులో యాక్టివ్ కేసులు 927 ఉన్నాయి. ఇక 2209 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 64 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా కేసుల రికవరీ రేటులో కూడా ఏపీ మెరుగ్గా ఉందని చెప్పాలి. దేశ రికవరీ రేటు 48 శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 45 శాతం ఉంది. అయితే ఏపీ మాత్రం  69 శాతం రికవరీ రేటు ఉందని ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ తెలిపారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..

విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..