రిమాండ్ ఖైదీ మృతి.. జైలు అధికారుల సస్పెన్షన్
రిమాండ్ ఖైదీ మృతి కేసులో జైలు సిబ్బందిపై వేటు పడింది. తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి కేసులో అధికారులు విచరాణ జరిపారు....
రిమాండ్ ఖైదీ మృతి కేసులో జైలు సిబ్బందిపై వేటు పడింది. తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి కేసులో అధికారులు విచరాణ జరిపారు. ముగ్గురు అధికారులను బాధ్యులుగా జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్చార్జ్ సబ్జైల్ సూపరింటెండెంట్ రాములు నాయక్, వార్డెన్లు చిట్టి బాబు, కొండలు, రంగారావులపై వేటు వేశారు. వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా సబ్జైళ్ల అధికారి కేవీ వీరేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సబ్ జైలులో రిమాండ్ ఖైదీ శంకర్ రావు మృతి అంశంపై అధికారులను ఉద్యోగులు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.