AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం…జలజగడం ముగిసేనా..?

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో

జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం...జలజగడం ముగిసేనా..?
Jyothi Gadda
|

Updated on: May 30, 2020 | 6:58 PM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించారు.

తెలంగాణలో నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ సామర్థ్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని.. వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ… కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఏపీ ఫిర్యాదు మేరకు ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కృష్ణాబోర్డు.ఈ మేరకు గతంలోనే తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇప్పటికే బోర్డు లేఖ రాసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇవే కాకుండా మరే ఇతర అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటే.. ప్రతిపాదనలు పంపిచాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌,జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఈ తరుణంలో కృష్ణా బోర్డు సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది.

మారిన బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు.. బీసీసీఐ కీలక నిర్ణయం?
మారిన బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు.. బీసీసీఐ కీలక నిర్ణయం?
ఈ సీనియర్ నటి మనవరాలు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
ఈ సీనియర్ నటి మనవరాలు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత