AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం…జలజగడం ముగిసేనా..?

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో

జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం...జలజగడం ముగిసేనా..?
Jyothi Gadda
|

Updated on: May 30, 2020 | 6:58 PM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించారు.

తెలంగాణలో నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ సామర్థ్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని.. వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ… కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఏపీ ఫిర్యాదు మేరకు ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కృష్ణాబోర్డు.ఈ మేరకు గతంలోనే తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇప్పటికే బోర్డు లేఖ రాసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇవే కాకుండా మరే ఇతర అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటే.. ప్రతిపాదనలు పంపిచాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌,జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఈ తరుణంలో కృష్ణా బోర్డు సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది.

Follow Us
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే