AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకాశం జిల్లాలో నిప్పంటుకుని నాలుగు పూరిల్లు దగ్ధం

ప్రకాశం జిల్లా పర్చూరులోని ఇందిరాకాలనీలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి. తొలుత ఓ గుడిసెలో అంటుకున్న మంటలు క్షణాల్లో మిగతావాటికి అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పేశారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని […]

ప్రకాశం జిల్లాలో నిప్పంటుకుని నాలుగు పూరిల్లు దగ్ధం
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 02, 2019 | 12:16 PM

Share

ప్రకాశం జిల్లా పర్చూరులోని ఇందిరాకాలనీలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి. తొలుత ఓ గుడిసెలో అంటుకున్న మంటలు క్షణాల్లో మిగతావాటికి అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పేశారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

Follow Us