జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
విజయ్ సీఎం అయ్యాక జననాయగన్ రిలీజ్ సులువు అవుతుందనుకున్నా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో ఆలస్యం అవుతోంది. సైనిక, మతపరమైన సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయి. నిర్మాత పరిష్కారం కోసం ఢిల్లీ సెన్సార్ బోర్డుకు వెళ్లారు. విడుదల కాకుంటే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్.
దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జననాయగన్ సినిమా విడుదల నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే, ఆయన సీఎంగా రెండు నెలలు అవుతున్నా, సినిమాకు మోక్షం లభించడం లేదు. సినిమా విడుదలపై నమ్మకాలు కూడా సన్నగిల్లుతున్నాయి. సెన్సార్ బోర్డు, జననాయగన్ చిత్రం మధ్య సాగుతున్న వివాదం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకునేందుకు నిర్మాత ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవేళ అక్కడ కూడా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించకపోతే, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మూవీ టీం నిర్ణయించుకుంది. గత కొద్ది నెలలుగా సెన్సార్ అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, చివరి ప్రయత్నంగా నిర్మాత ఢిల్లీకి బయలుదేరారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్డే కేక్లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

