AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishaka: మనవరాలిపై 60 ఏళ్ల వృద్ధుడు పాశవికం.. సంచలన తీర్పు ఇచ్చిన పోక్సో కోర్ట్‌

పోక్సో కేసులో విశాఖ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మనవరాలు పై అత్యాచారం చేసిన పాపానికి ఆరుపదుల తాత కు ఇరవైయ్యేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు అయిదు లక్షల జరిమానా విధించింది స్పెషల్ పోక్సో కోర్ట్. వివరాల్లోకి వెళితే.. విశాఖ మల్కాపురంకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో పాటు నానమ్మతాతయ్యలతో కలిసి రెండు అంతస్తుల...

Vishaka: మనవరాలిపై 60 ఏళ్ల వృద్ధుడు పాశవికం.. సంచలన తీర్పు ఇచ్చిన పోక్సో కోర్ట్‌
Vishaka Court
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 28, 2024 | 6:29 PM

Share

సమాజంలో రోజురోజుకీ విలువలు దిగజారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు ఎంతకైనా బరితెగిస్తారు. వావి వరసలు మరిచి మృగాల్లో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మానవ మృగానికే స్పెషల్‌ పోక్సో కోర్ట్‌ సంచల తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పోక్సో కేసులో విశాఖ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మనవరాలు పై అత్యాచారం చేసిన పాపానికి ఆరుపదుల తాత కు ఇరవైయ్యేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు అయిదు లక్షల జరిమానా విధించింది స్పెషల్ పోక్సో కోర్ట్. వివరాల్లోకి వెళితే.. విశాఖ మల్కాపురంకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో పాటు నానమ్మతాతయ్యలతో కలిసి రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. ఇదే సమయంలో బాలిక తరచూ రెండో అంతస్తులో తన తాత గారి ఇంట్లో చదువుకుంటూ ఉండేది.

ఇదే సమయంలో కంటి రెప్పలా చూడాల్సిన 60 ఏళ్ల వి.శ్యామ్‌ సుందర్‌ (చిన్నారి తాతయ్య) చూపు చిన్నారిపై పడింది. కనీసం మనిషిననే విషయాన్ని కూడా మరిచిపోయి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిచ్చాడు. ఇలా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తల్లికి విషయం తెలియడంతో బాలికను ప్రశ్నించింది. దీంతో తనపై జరిగిన అన్యాయాన్ని ఆమె.. వివరించింది. విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంట్లో అందరినీ చంపేస్తా అని బెదిరించడంతో ఎవరికి చెప్పలేదని చెప్పి ఆవేదన చెందింది.

దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన తల్లి వెంటనే.. మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో చార్జీ షిట్ ఫైల్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నేరం రుజువు కావడంతో కోర్టు సంచలన తీర్పు చెబుతూ శిక్ష ఖరారు చేసింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు