AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyotiraditya Scindia: రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు..

రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భూమి పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్, ఇతర అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ప్రారంభించారు.

Jyotiraditya Scindia: రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు..
Jyotiraditya Scindia
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2023 | 3:20 PM

Share

రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భూమి పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్, ఇతర అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ప్రారంభించారు.పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దాని ప్రకారమే రాజమండ్రిలో నూతన టెర్మినల్ నిర్మాణం జరుపుతున్నామని సింధియా తెలిపారు. కొత్త టెర్మినల్ 17000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతుందని తెలిపారు. ఇది ప్రస్తుత టెర్మినల్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని.. రాజమండ్రి విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా కృషి చేస్తామని కేంద్ర జ్యోతిరాదిత్య సింధ్య తెలిపారు. మోడ్రన్ టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో టెర్మినల్ నిర్మాణం జరుగుతుందన్నారు. టెర్మినల్ నిర్మాణం పూర్తైతే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలో 10 నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు టెర్మినల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సింధియా.. రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అంటూ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ భరత్, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే జక్కంపూడి తదితరులు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్ లో మరో టెర్మినల్ శంకుస్థాపనతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు మరింత గుర్తింపు రానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..