AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: మంచిని మెచ్చని పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నష్టం చేస్తున్నామని మాట్లాడటం బాధాకరమన్నారు. అసలు అమరావతి ఉద్యమం కాదు.. అత్యాశాపరుల ఉద్యమం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Roja: మంచిని మెచ్చని పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
Minister Roja
Surya Kala
|

Updated on: Oct 10, 2022 | 3:01 PM

Share

తిరుమల శ్రీవారిని పర్యాటక శాఖ మంత్రి రోజా దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం అర్చకులు మంత్రి రోజాను ఆశీర్వదించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై  ఘాటుగా విమర్శలు చేశారు. అంతేకాదు మూడు రాజధానులను అభివృద్ధి చేయాలని తండ్రి మనస్సుతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులపై ప్రాంతాలను రెచ్చగొట్టేవిధంగా టీడీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టాలంటే ఎవ్వరూ ఒప్పుకోరని తెలిపారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నష్టం చేస్తున్నామని మాట్లాడటం బాధాకరమన్నారు. అసలు అమరావతి ఉద్యమం కాదు.. అత్యాశాపరుల ఉద్యమం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు పన్నులు కట్టేటప్పుడు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. అమరావతి రైతులు వైజాగ్ కు పాదయాత్రగా వెళ్లడం అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకే అంటూ ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు, నారా లోకేష్ లు ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిగా 6 నెలలు నిద్ర పోతాడు, 6 నెలలు మేలుకొంటాడు.. ప్రజలు అభిమానించే స్టార్ గా పవన్ కళ్యాన్ ప్రజలకు ఏంచేశాడో చెప్పాలంటూ ప్రశ్నించారు మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు.. టీడీపీ, బీజేపీలకు ఓటేయమని తిరిగినప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కనిపించలేదా అన్నారు రోజా.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు పోతున్నారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం విచిత్రంగా ఉందని.. అసలు ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్, జగన్ హాయాంలలోనే అన్నారు. గతంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయొలని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు.. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాన్ కు ఏ ప్యాకేజీ అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.

చంద్రబాబు బినామీ లింగమనేని పవన్ కళ్యాణ్ కు భూమిలిచ్చాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా? అసలు పార్టీ పెట్టడం కాదు సీరియస్ పొలిటీషియన్ గా నిలబడి మంచిని ఆహ్వానించాలన్నారు.. రోజుకో మాట, పూటకో వేషం వేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ ను కొడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా..

మరోవైపు తిరుమలలో భక్తుల పెరిగిన రద్దీ పెరిగింది. శిలాతోరణం వరకు మూడున్నర కిలో మీటర్ల మేర క్యూ లైన్ ఉంది. వైకుంఠం రెండు కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో నిండుకున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్