AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి

తిరుమల భక్తులకు TTD అత్యాధునిక వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా గుండె పోటు వస్తే.. రక్షించేందుకు కొండపై టెనెక్టెస్‌ ప్లస్‌ ఇంజక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

TTD: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి
Ttd Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2022 | 8:46 PM

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనార్థం వ‌చ్చే భ‌క్తులకు రుయా ఆస్పత్రి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అత్యవ‌స‌ర వైద్యం అవ‌స‌ర‌మైన ప‌క్షంలో గుండెపోటు నుండి ర‌క్షించేందుకు తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రివారి ఆధ్వర్యంలో టెనెక్టేస్ ప్లస్‌ ఇంజ‌క్షన్ అందుబాటులోకి తెచ్చింది. తిరుమ‌ల‌లోని రాంభ‌గీచా గెస్ట్‌ హౌస్‌ దగ్గర ఉన్న ప్రథ‌మ చికిత్స కేంద్రంలో TTD అడిషనల్‌ EO ధర్మారెడ్డి ఈ మెడిసిన్‌ను విడుదల చేశారు. గుండె ర‌క్తనాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్టడం లాంటి స‌మ‌స్యల కార‌ణంగా గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు ఈ ఇంజ‌క్షన్ వేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. దక్షిణ భార‌త‌దేశంలో రుయా ఆసుప‌త్రికి మాత్రమే ఈ ప్రాజెక్టు మంజూరైంద‌ని తెలిపారు. తిరుప‌తి కేంద్రంగా చుట్టుప‌క్కల 13 ప్రాంతాల్లో ఈ ఇంజ‌క్షన్ అందుబాటులో ఉంటుంద‌న్నారు. మార్కెట్‌లో దీని ధ‌ర 35 వేల నుండి 40 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. రుయా ఆసుప‌త్రిలో మాత్రం ఉచితంగా అందిస్తారని వెల్లడించారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు.

ఐసిఎంఆర్ ప్రాజెక్టు కింద దేశంలోని 9 ఆసుప‌త్రుల‌కు ఈ ప్రాజెక్టును కేటాయించారని తెలిపారు. రుయా ఆసుప‌త్రికి వంద కిలోమీట‌ర్ల ప‌రిధిలోని PHCలు, CHCలల‌ను ఎంపిక చేసుకుని ఇంజ‌క్షన్ అందించే ఏర్పాట్లు చేశారు.

Also Read: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?