AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంత కష్టం.. 25ఎకరాల దానిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు.. రూ. 75లక్షల ఆస్తి నష్టం..

మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తోటలోని మొక్కలతోపాటు వ్యవసాయ బోర్లు, బిందు సేద్యం కోసం తీసుకొచ్చి పెట్టిన పరికరాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.

అనంత కష్టం.. 25ఎకరాల దానిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు.. రూ. 75లక్షల ఆస్తి నష్టం..
Pomegranate Crop
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 22, 2023 | 12:12 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. మరికొద్దిరోజుల్లో చేతికి వస్తుందనుకున్న పచ్చని పంటకు దుండగులు నిప్పుపెట్టారు. దాదాపు 25 ఎకరాల్లో వేసిన దానిమ్మ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి కాల్చేశారు. మంగళవారం రాత్రి జిల్లాలోని బొమ్మనహాల్ మండలంలోని ఏళంజి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మురళీకృష్ణ, రేణుక, వరలక్ష్మి, బాబురావు అనే రైతులు 25 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఇటీవలే పంట కాపుకు కూడా వచ్చింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తోటలోని గడ్డికి నిప్పుపెట్టారు. గడ్డికి పెట్టిన నిప్పు చెలరేగి 25 ఎకరాల్లోని తోటకు మంటలు అంటుకుని పంటంతా పూర్తిగా దద్దమైపోయింది.

తోట తగలబడుతున్న సంగతి గమనించిన చుట్టుపక్కల స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9 గంటలకు రాయదుర్గం నుంచి ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తోటలోని మొక్కలతోపాటు వ్యవసాయ బోర్లు, బిందు సేద్యం కోసం తీసుకొచ్చి పెట్టిన పరికరాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి.

దుండగులు చేసిన దాడితో దాదాపుగా రూ. 75 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో తోట దగ్గర కాపలాదారుడు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం బాధిత రైతులు హైదరాబాదుకు వెళ్లడంతో కాపలాదారు మాత్రమే అక్కడ ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..