AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో అద్దెకు దిగి.. ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులమంటూ.!

దొంగలు రూటు మార్చారు. ఏకంగా పోలీసుల పేరు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా....

ఇంట్లో అద్దెకు దిగి.. ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులమంటూ.!
Image
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 24, 2021 | 1:20 PM

దొంగలు రూటు మార్చారు. ఏకంగా పోలీసుల పేరు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా యర్నగూడెంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిని అద్దె ఇంటి పేరుతో నిలువు దోపిడీ చేశారు. నాగేశ్వరరావుకు సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో పక్క పోర్షన్‌ ఖాళీగా ఉండటంతో టులెట్‌ బోర్డు పెట్టాడు. ఫ్యామిలీస్‌కు మాత్రమే ఇల్లు అద్దెకు ఇస్తామని బోర్డులో స్పష్టంగా తెలిపారు.

అయితే, ఆ బోర్డు చూసిన ఓ వ్యక్తి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి తాను పోలీస్‌నని, ఫ్యామిలీతో పాటు ఉండేందుకు ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి పోలీస్‌ అని నమ్మిన నాగేశ్వరరావు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించాడు. మరుసటి రోజు ఓ మహిళను తీసుకొచ్చి తన భార్యగా నాగేశ్వరరావుకు పరిచయం చేశాడు. రెండు రోజులు ఇంట్లో ఉండి, ఆ తర్వాత బ్యాగ్‌తో వెళ్లిపోయారు. మరుసటి రోజు ఒక్కడే రావడంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు అతని ఆధార్‌కార్డ్‌ అడిగాడు. అయితే ఇప్పుడు తన దగ్గర లేదని, రెండు రోజుల తర్వాత తెచ్చి ఇస్తానని చెప్పాడు.

మరో రోజు సాయంత్రం 6 గంటలకు ఓ వ్యక్తి వచ్చాడు. రాత్రి 7.30కి తిరిగి వెళ్లాడు. వెళ్లే సమయంలో ఇద్దరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి. అయితే అద్దెకు ఇల్లు తీసుకున్నారు కనుక సామాన్లు కావొచ్చని నాగేశ్వరరావు భావించారు. నాగేశ్వరరావుకు బట్టల దుకాణం ఉండటంతో రాత్రి 9.30 వరకు కుటుంబసభ్యులు ఇంటికిరారు. అయితే రాత్రి 9.30కి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, 20 వేల నగదు మాయమయ్యాయి. దీంతో పోలీస్‌ యూనిఫామ్‌లో ఇంట్లో అద్దెకు దిగిన వారి పనేనని భావించి నాగేశ్వరరావు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.