AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా బోర్డు ఏర్పాటు చేశారు..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు.
Ap Cm Jagan
Narender Vaitla
|

Updated on: Mar 16, 2023 | 7:07 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా బోర్డు ఏర్పాటు చేశారు. 17 పోస్టులతో ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసింది.

బోర్డుకు ఛైర్మన్‌గా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉండనున్నారు. మెంబర్‌గా వైద్య ఆరోగ్య శాఖ నుంచి జేడీ(అడ్మిన్) స్థాయి అధికారి ఉండనున్నారు. ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకంలో రాష్ట్ర, జోనల్‌, జిల్లా స్థాయి అధికారులు తలమునకలవుతున్నారు. అయితే ఇక నుంచి వీరికి వెసులుబాటు కల్పిస్తూ ఎపి మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుతో ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించనున్న హెచ్వోడీ , జోనల్ , జిల్లా స్థాయి అధికారులు.

వైద్య శాఖలో ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలిచ్చారు. అందుకనుగుణంగా పనిచేయనున్న ఎపి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..