AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఖాళీ అవుతున్న టీడీపీ.. రాజీనామా చేసిన కాపు నేతలు

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి మరిచిపోకముందే.. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 నాటికి పూర్తిగా తన ప్రాభవాన్నికోల్పోయింది. కేవలం 23 అసెంబ్లీ స్ధానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా తయారైంది. ఇప్పటికే టీడీపీ చెందిన పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీలో చేరిపోయారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ […]

ఏపీలో ఖాళీ అవుతున్న టీడీపీ.. రాజీనామా చేసిన కాపు నేతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 29, 2019 | 6:52 PM

Share

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి మరిచిపోకముందే.. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 నాటికి పూర్తిగా తన ప్రాభవాన్నికోల్పోయింది. కేవలం 23 అసెంబ్లీ స్ధానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా తయారైంది.

ఇప్పటికే టీడీపీ చెందిన పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీలో చేరిపోయారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు టీడీపీకి కాపు సామాజిక వర్గం అండగా నిలబడింది. అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ఆ వర్గం దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరుపుల రాజా తాజాగా తన అనుచర వర్గంతో సహా టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు బాగోలేవంటూ ఆరోపించారు. సమీప భవిష్యత్తులో టీడిపిలో కాపులకు భవితవ్యం లేదని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్ ఎన్నికలకు ముందే తన స్టాండ్ చెప్పారని, అదే విధంగా ఆయన కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మంచి పరిపాలన అందిస్తున్న వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వరుపుల రాజా. టిడిపిలో కాపులకు భవిష్యత్తు లేదనందున 80 శాతం మంది కాపులు టీడీపీ నుండి బయటకు రాబోతున్నారని వరుపుల రాజా తెలిపారు.

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?