AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడమా.?.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గత 20 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గిపోయిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా వరకు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో...

Andhra Pradesh: నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడమా.?.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
Chandrababu
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 08, 2022 | 10:43 AM

Share

ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గత 20 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గిపోయిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా వరకు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో టెన్త్ రిజల్స్టపై(Tenth Results) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో తప్పామని ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ధైర్యంగా ఉండాలని, వ్యవస్థలో లోపాలకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. టీడీపీ పాలనలో 90-95 శాతం ఉన్న పాస్ పర్సంటేజ్.. ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా? అని ప్రశ్నించారు. ఫెయిల్ అయ్యింది(Andhra Pradesh) ప్రభుత్వ వ్యవస్థలే, గానీ విద్యార్థులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు.. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. నేతల పనితీరులో నెలలో మార్పు రావాల్సిందేనని కోరారు.

రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 6,21,799 మంది హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 11,751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...