Andhra Pradesh: త్వరలోనే తోపుదుర్తి బండారం మొత్తం బయటపెడతా.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

పాదయాత్ర చేస్తోన్న తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సునీత. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సూచనతోనే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు సునీత.

Andhra Pradesh: త్వరలోనే తోపుదుర్తి బండారం మొత్తం బయటపెడతా.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
Thopudurthy,paritala Sunith
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 23, 2022 | 10:11 AM

రాప్తాడులో పొలిటికల్‌ హీట్‌ మళ్లీ పీక్స్‌కి చేరింది. పరిటాల, తోపుదుర్తి మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అగ్గిరాజేస్తున్నారు ఇరువురు నేతలు. రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నాయకురాలు పరిటాల సునీత… ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టార్గెట్‌గా హాట్‌ కామెంట్స్‌ చేశారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. ‘ప్రకాష్‌రెడ్డీ జాగ్రత్తగా ఉండూ’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. రైతుల కోసం తెలుగుదేశం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు పరిటాల సునీత. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను కంప్లీట్‌ చేసుకుని, ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే, పాదయాత్ర చేస్తోన్న తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సునీత. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సూచనతోనే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు సునీత. త్వరలోనే ప్రకాష్‌రెడ్డి బండారం మొత్తం బయటపెడతానంటోన్న పరిటాల సునీత.. రాప్తాడులో జరుగుతోన్న అక్రమాలు సీఎం జగన్‌కు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

కాగా జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉందా అని ఈ సందర్భంగా సవాల్ విసిరారు పరిటాల సునీత. రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే ప్రకాష్ రెడ్డి.. అన్నదాతలకు చేసిందేమీ లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తన పాదయాత్ర కార్యక్రమాలకు ఆటంకాలు కలగజేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా రైతుల కోసం పాదయాత్రను విజయవంతం చేస్తానని.. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారామె.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!