AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అన్నమో రామచంద్రా.. బిల్లుల పెండింగ్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల ఆకలి కేకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పదకొండు ప్రభుత్వాస్పత్రుల్లో భోజనాలు బంద్‌ అయ్యాయి. దాంతో, హోటల్స్‌ నుంచి ఆహారం తెచ్చుకుని తింటున్నారు రోగులు. కోనసీమ జిల్లాలో మొత్తం 38లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు అధికారులు.

Andhra Pradesh: అన్నమో రామచంద్రా.. బిల్లుల పెండింగ్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల ఆకలి కేకలు
Amalapurm Hospital
Basha Shek
|

Updated on: Nov 23, 2022 | 11:49 AM

Share

మొన్న రాజోలు ప్రభుత్వాస్పత్రి, ఇప్పుడు అమలాపురం ఏరియా ఆస్పత్రి. ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఫుడ్‌ సప్లై నిలిపివేశారు కాంట్రాక్టర్లు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆహారం పంపిణీ నిలిచిపోవడంతో స్వచ్ఛంద సంస్థ భోజనాలు అందించింది. అన్నం, సాంబారుతో రోగులకు భోజనం పెట్టారు దాతలు. ఈ రెండు ఆస్పత్రులే కాదు.. జిల్లాలోని పదకొండు ప్రభుత్వాస్పత్రుల్లో భోజనాలు బంద్‌ అయ్యాయి. దాంతో, హోటల్స్‌ నుంచి ఆహారం తెచ్చుకుని తింటున్నారు రోగులు. కోనసీమ జిల్లాలో మొత్తం 38లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు అధికారులు. అమలాపురం ఆస్పత్రికి 13లక్షలు, రామచంద్రాపురం 9లక్షలు, కొత్తపేట 6లక్షలు, రాజోలు 5లక్షలు, అల్లవరం లక్ష, కపిలేశ్వరం లక్ష, ఆలమూరు ఆస్పత్రికి 91వేలు, ముమ్మిడివరం హాస్పిటల్‌కి 81వేల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. . కొన్ని నెలలుగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు ఫుడ్‌ సప్లై నిలిపివేశారని అంటున్నారు. బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో కాంట్రాక్టర్లు ఫుడ్‌ సప్లై ఆపేశారని, దానికి తామేం చేయగలం అంటున్నారు హాస్పిటల్స్‌ ఇన్‌ఛార్జ్‌లు.

కాగా జిల్లాలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చేవాళ్లలో మెజారిటీ రోగులు పేదలే కావడంతో బయటికి నుంచి ఆహారం తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్‌లో ఫుడ్‌ కొనుక్కొని తినే స్థోమత తమకు లేదని రోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రోజువారీ ఆహారం ప్రొవైడ్‌ చేయాలని కోరుతున్నారు రోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..