AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anakapalle: ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. కానీ విచిత్రంగా అక్కడ చేపలకు బదులుగా…

పున్నమి రోజులు నడుస్తున్నాయ్. సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయ్. దీంతో ఉప్పుటేరుకు చేపలు బాగా వచ్చి చేరతాయని భావించారు జాలర్లు. అదే విషయాన్ని కన్ఫామ్ చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ విచిత్రంగా....

Anakapalle: ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. కానీ విచిత్రంగా అక్కడ చేపలకు బదులుగా...
Snake Like Fish
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2023 | 2:51 PM

Share

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక ఉప్పుటేరులో పాముల పోలిన చేపలు కలకలం సృష్టిస్తున్నాయి. పాముల్లాంటి చేపలు నీటిలో అటు ఇటు తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వింత కనిపించడంతో మత్సకారులు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవంగా ఆటు, పోటుల సమయంలో సముద్రంలోని చేపలు వచ్చి ఈ ఉప్పుటేరులో చేరుతుంటాయి. స్థానికంగా ఉండే మత్స్యకారులు చేపలను వేటాడి జీవనోపాధి చేసుకుంటుంటారు. అయితే పున్నమి రోజులు కావడం ఆటుపోట్లు ఎక్కువగా ఉండటంతో మరిన్ని చేపలు వచ్చి చేరతాయని భావించిన మత్స్యకారులు.. శుక్రవారం ఉదయం ఉప్పుటేరు వద్దకు వెళ్లారు. అక్కడ నీటిలో అటు ఇటు తిరుగుతున్న పాము లాంటి చేపలను చూసి ఆశ్చర్య పోవాల్సి వచ్చింది

గతంలో మాదిరి కాకుండా పాములు పోలిన చేపలు అధికంగా వచ్చి చేరాయి. వీటిని గమనించిన మత్స్యకారులు ఇవి నేరుగా సముద్రంలోంచి వచ్చి చేరినవా..? లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేట లేని సమయంలో ఇటువంటి పరిస్థితులు తమ ఉపాధిపై ప్రభావం చూపుతున్నాయన్నది మత్స్యకారుల ఆవేదన.

-ఖాజా, విశాఖపట్నం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..