AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: కాస్త మారండి గురూ.. రైళ్లు కూడా మన ఇళ్ల వంటివే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ నెల15 న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం ఆయిన వందే భారత్ ట్రైన్ ను ప్రయాణీకులు మురికి కూపం లా చేస్తున్నారంటూ రైల్వే అధికారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Vande Bharat Express: కాస్త మారండి గురూ.. రైళ్లు కూడా మన ఇళ్ల వంటివే..
Vande Bharat Train
Surya Kala
|

Updated on: Jan 21, 2023 | 5:05 PM

Share

దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్‌ రైలు’ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన సికింద్రాబాద్‌– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సదుపాయాలు..  విమానం తరహాలో సీటింగ్ తో మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ నెల15 న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం ఆయిన వందే భారత్ ట్రైన్ ను ప్రయాణీకులు మురికి కూపం లా చేస్తున్నారంటూ రైల్వే అధికారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణీకులు తాము తాగి, తిన్న తర్వాత వ్యర్ధాలను, కప్పులు, ప్లేట్స్ ను కోచ్ లలోనే పడేస్తున్నారని.. చాలా చెత్తాచెదాలతో నింపేస్తూ.. ఆపరిశుధ్యపాలు చేస్తున్నారంటూ రైల్వే అధికారులు మదనపడి పోతున్నారు. ఉదయం విశాఖ నుంచి శుభ్రం గా వెళ్ళే ట్రైన్ తిరిగి రాత్రికి చేసుకునే సరికి కంపు కంపు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రయాణీకులు ఒక్కసారి ఆలోచించాలని రైల్వే ఉన్నతాధికారుల చేతులు జోడించి వేడుకుంటున్నారు.

వ్యక్తి గతంగా మనం ఎలా శుభ్రంగా ఉంటామో అలానే ట్రైన్ ను కూడా శుభ్రంగా ఉంచాలంటూ వేడుకుంటున్నారు వాల్తేర్ డివిజన్ డీ అర్ ఎం అనూప్ కుమార్. చెత్త, చెదారం, వ్యర్థాల కోసం ట్రైన్ లో ఉన్న డస్ట్ బిన్ లను వాడాలని కోరుతున్నారు. ఇది మన గౌరవానికి సంబందించిన సమస్య అంటూ చురకలు కూడా అంటిస్తున్నారు రైల్వే ఉన్నతాధికారులు.

ఇవి కూడా చదవండి

ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌ డోర్స్, స్మోక్‌ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్‌ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్న సంగతి తెలిసిందే.. ఈ ట్రైన్ టికెట్ ధరను బట్టి.. ఈ రైలులో ప్రయాణించేవారు ఎక్కువగా ధనికులు, ఉద్యోగాలు వంటి వారే ఉండే అవాకాశం  తెలిసిందే.

Reporter: Eswar

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..