AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీచర్స్‌పై ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్.. విచారణ కోసం పోలీసులు స్కూల్‌కు వెళ్లగా ట్విస్ట్

Andhra News: ఇప్పుడు కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్న ఘటనలు చూస్తున్నాం.. కొందరు పిల్లలు సైతం పిడుగుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు.

Andhra Pradesh: టీచర్స్‌పై ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్.. విచారణ కోసం పోలీసులు స్కూల్‌కు వెళ్లగా ట్విస్ట్
Students Obscene Behavior
Ram Naramaneni
|

Updated on: Feb 19, 2022 | 6:07 PM

Share

Anantapur District: ఇప్పుడు కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్న ఘటనలు చూస్తున్నాం.. కొందరు పిల్లలు సైతం పిడుగుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు గురువులు అంటే విద్యార్థులకు విపరీతమైన భయం, భక్తి ఉండేవి. టీచర్స్ సైతం పిల్లలకు చదువు మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ప్రవర్తన నేర్పేవారు. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది.  తాజాగా టీచర్స్‌పై కంప్లైంట్ చేసేందుకు స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. కొందరు విద్యార్థుల ప్రవర్తన సరిగా లేదని తమ పేరెంట్స్‌ను తీసుకురావాలని ప్రధాన ఉపాధ్యాయురాలు చెప్పారు. కానీ స్టూడెంట్స్.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి గురువులపై ఫిర్యాదు చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ(Uravakonda) హైస్కూల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ జిల్లా పరిషత్​ హై స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న కొందరు విద్యార్థుల ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వారి పేరెంట్స్‌ను తీసుకురావాలని సూచించారు. ఆ విద్యార్థులు తల్లిదండ్రులను తీసుకురాకుండా.. స్టైయిట్‌గా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. టీచర్ కొడుతూ.. ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

ఎంక్వైరీ చేసేందుకు పోలీసుల పాఠశాలకు వెళ్లగా.. ఉపాధ్యాయులు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. పిల్లలు తరగతి గదిలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌కు మద్యం, సిగరెట్లు తెస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. పాఠాలు చెప్పే సమయంలో అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని వివరించారు. పాఠశాలలో ఫర్నీచర్ కూడా ధ్వంసం చేశారని అన్నారు. యూనిఫార్మ్ వేసుకోకుండా.. సరిగా హెయిర్ కటింగ్ చేసుకోకుండా వస్తున్నారని వెల్లడించారు. అందుకే ఆ విద్యార్థులను బయటకు పంపి.. తల్లిదండ్రులను తీసుకురమ్మని చెప్పినట్లు వివరించారు.

Also Read: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్