AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‎కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రయాణికుల వద్ద టికెట్‎కు అధిక ధరల వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు...

RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‎కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..
Bus
Srinivas Chekkilla
|

Updated on: Oct 07, 2021 | 8:08 PM

Share

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రయాణికుల వద్ద టికెట్‎కు అధిక ధరల వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దసరా పండుగ సెలవులు నేపథ్యంలో టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఫిర్యాదులు అండటంతో ఆర్టీఏ అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ట్రావెల్స్ యాజమాన్యాలతో సమావేశమై కృష్ణా జిల్లా డీటీసీ పురేంద్ర యాజమాన్యాలతో మాట్లాడారు. అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులు సీజ్ చేస్తామన్నారు. ప్రధాన కూడళ్లలో బస్సుల తనిఖీలు చేపడతామన్నారు.

ఇటు తెలంగాణలోనూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‎పేట ఓఆర్ఆర్​వద్ద బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్ని 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Read Also.. YouTube: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. యూ ట్యూబ్ చూసి ఆ పని చేద్దామనుకున్నాడు.. కానీ..