AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మామిడి చెట్టులో అరుదైన దృశ్యం.. చూసి ఆశ్చర్యపోయిన జనం..

దేవుడి మహిమలు అన్ని ఇన్ని కాదు.. అన్ని చోట్లా దేవుడు ఉంటాడని ఓ నానుడి ఉంది. సరిగ్గా దానికి నిదర్శనంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే..

AP News: మామిడి చెట్టులో అరుదైన దృశ్యం.. చూసి ఆశ్చర్యపోయిన జనం..
Telugu News
B Ravi Kumar
| Edited By: |

Updated on: Dec 30, 2024 | 12:51 PM

Share

భగవంతుని గురించి..ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడికి చెప్పడం.. ఆ సమయంలో తాను అన్నింటా ఉన్నానని తెలియజేస్తూ ఓ స్థంభాన్ని చీల్చుకొని ఉగ్రనరసింహుడు బయటకు రావడం మనం పురాణాల్లో చదువుకున్నాం.. సినిమాల్లోనూ ఆ ఘట్టాన్ని మనకు కళ్లకుగట్టినట్టు చూపించారు. నిజానికి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని హిందువులు విశ్విసిస్తారు. ఆ విశ్వాసాన్ని రుజువు చేసే ఎన్నో ఘటనలు ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కొబ్బరి కాయలో వినాయకుడు తొండంతో సహా దర్శనమిచ్చాడని అంతా పూజలు చేశారు. తాజాగా ఓ మామిడి చెట్టులో నరసింహస్వామి రూపం ఏర్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. అవి దేవుని మహిమలుగా ప్రజలు చెప్పుకుంటారు. విశ్వసిస్తారు. అటువంటి వింత సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం బొండాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మందపాటి వెంకటేశ్వరరావు కుమారుడు రామలింగేశ్వరరావు ఇంటి పెరట్లో ఓ మామిడిచెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకు లక్ష్మీ నరసింహస్వామి రూపం ఏర్పడింది. ఇంటి యజమాని తొలుత యాదృచ్ఛికంగా వచ్చిందేమోనని పట్టించుకోకుండా వదిలేశారు. రోజురోజుకు ఆకారం మరింత స్పష్టంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు లక్ష్మి నరసింహస్వామిగా గుర్తించారు. ఆ రూపానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ చెట్టుకు వచ్చిన ఆకారానికి చక్కగా రంగులు దిద్దడంతో ఆ నరసింహస్వామి రూపం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వచ్చి మామిడి చెట్టులోని లక్ష్మీనరసింహస్వామి పూజలు చేస్తున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి తమను ఇలా కరుణించారని రామలింగేశ్వరరావు కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..