పక్షులను గమనించే వారిలో.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు!
ప్రకృతిలో గడపడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కెనడియన్ న్యూరోసైన్స్ నిపుణుల తాజా అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. పచ్చని చెట్లపై, ఇంటి పరిసరాల్లో ఇలా ఎక్కడైనా సరే.. పక్షులను గమనించడం, వాటి కిలకిల రావాలు వినడం మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని జ్ఞాపక శక్తిని పెంచుతుందని తెలిపింది.
బర్డ్ వాచింగ్ అనేది కొద్దిపాటు సంతోషానికే పరిమితం కాదు, అది మీ మెదడుకు ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. క్రమం తప్పకుండా పక్షులను గమనిస్తూ గడిపేవారిలో శ్రద్ధ , జ్ఞాపక శక్తి, ప్యాటర్న్ గుర్తింపు వంటి మానసిక ప్రక్రియలు ఉత్తేజితం అవుతాయని చెబుతున్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు తరచుగా పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాలను ఆస్వాదించేవారి మెదడు పనితీరును విశ్లేషించగా, శ్రద్ధ, దృశ్య గ్రహణం, వర్కింగ్ మెమరీ మరింత మెరుగుపడినట్లు గుర్తించారు.పక్షులను గమనించే అలవాటు మానవుల్లో మెదడు న్యూరోప్లాస్టిసిటీని పెంచి, కాగ్నెటివ్ సామర్థ్యాలను కూడా మెరుగు పరుస్తుందని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రకృతితో ముడిపడి ఉండటంవల్ల ఫోకస్, ఆసక్తి, నేర్చుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్ మెరుగుపడటం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతాయట. మానసిక ఆనందం, ఏకాగ్రత పెరుగుతాయి. ఇవన్నీ మెదడు సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా పరోక్షంగా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

