విజయవాడలో మరో బాలికపై అత్యాచారం..!

విజయవాడ భవానీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా చోటు చేసుకుంది. పూల డెకరేషన్‌‌కని వెళ్లిన బాలికపై సాయి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. సాయితో పాటు మరో ఇద్దరి స్నేహితులు కూడా.. బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం వెంటనే బాలిక.. తల్లికి చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి సహా.. అతని స్నేహితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు.. గాలిస్తున్నారు. […]

విజయవాడలో మరో బాలికపై అత్యాచారం..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 4:52 PM

విజయవాడ భవానీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా చోటు చేసుకుంది. పూల డెకరేషన్‌‌కని వెళ్లిన బాలికపై సాయి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. సాయితో పాటు మరో ఇద్దరి స్నేహితులు కూడా.. బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం వెంటనే బాలిక.. తల్లికి చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి సహా.. అతని స్నేహితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు.. గాలిస్తున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక వైపు పెద్ద ఎత్తున.. దేశ వ్యాప్తంగా.. దిశ ఘటనతో నిరసనలు పెల్లుబుకుతుంటే.. మరో వైపు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.