AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పంచతంత్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జనసేన..

వ్యూహాలు కంటికి కనిపించవు.. ఒక వేళ కనిపించినా అది వ్యూహమని తెలియదు. ఈ విషయం పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నో సందర్భాలలో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే రకరకాల వ్యూహాలు వేస్తున్న జనసేనాని.. ఒక దాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నారు.

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పంచతంత్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జనసేన..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Dec 20, 2022 | 7:11 PM

Share

వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలాగైనా గెలిపించాలని.. సీఎం పదవి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేనాని. దీని కోసం ఓ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఐదు… ఐదే ఐదు కార్యక్రమాల ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.ఇంతకీ ఆ ఐదు కార్యక్రమాలు ఏమిటి..? వాటి వల్ల జనసేనకు ఉపయోగం ఏమిటి..? వ్యూహం నేను వేస్తా.. నన్ను నమ్మండి అని పదే పదే అంటుంటారు పవర్ స్టార్. ఇంతకీ ఏమిటా వ్యూహమో చాలా మందికి తెలియదు. వ్యూహాలు కంటికి కనిపించవు.. ఒక వేళ కనిపించినా అది వ్యూహమని తెలియదు. ఈ విషయం పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నో సందర్భాలలో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే రకరకాల వ్యూహాలు వేస్తున్న జనసేనాని.. ఒక దాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నారు. అయితే వాటిని వ్యూహాలు అనడం కంటే తంత్రాలు అంటే బాగుంటుందేమో.. ఎన్నికల లో జనసేనను గెలిపించే ఆ తంత్రాలపైనే ఇప్పుడు పవర్ స్టార్ ఫోకస్ పెట్టారని సమాచారం. మొత్తం పంచ తంత్రాలు జనసేన ఇప్పుడు గెలిపిస్తాయని భావిస్తున్నారు జనసేన నేతలు. ఈ పంచతంత్రాల్లో ఇప్పటికే రెండు అమలవుతుండగా.. మరో మూడు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ఇంతకీ ఏమిటా పంచతంత్రాలు..? దాని వల్ల ఉపయోగం ఏమిటి..?

ప్రజల్లోకి వెళ్లడం, వారి కష్టాలను తెలుసుకోవడం, వీలైనంత సహాయం చేయడం కోసం జనసేన నిర్వహిస్తున్నా.. నిర్వహించనున్న కార్యక్రమాలే ఈ పంచతంత్రాలు.వీటిలో మొదటిది జనవాణి కాగా.. రెండుదో కౌలు రైతు భరోసా యాత్ర. ఈ రెండు ఇప్పటికే జనసేన ఫాలో అవుతోంది. ఇక పంచతంత్రాల్లో మూడోవది యువశక్తి కార్యక్రమం. పవన్ కల్యాణ్ కు కొండంత అండగా ఉండేది యువత. వారిని ఓ సిస్టమేటిక్ పద్ధతిలోకి తీసుకొచ్చి పార్టీ గెలుపుకోసం వారు పనిచేసేలా చేయనున్నారు సేనాని. దీని కోసం జనవరి 12న యువశక్తి సభ నిర్వహించనున్నారు. దానితో పాటు ప్రత్యేక కమిటీలు నియమించనున్నారు.

ఇక పంచతంత్రాల్లో నాలుగోది..ప్రస్తుతానికి సీక్రెట్ ఉంచారు. దీనిని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.పాలన సాగిస్తున్న అధికార పక్ష నేతల అవినీతి చిట్టా సేకరణ నల్గోది గా ఉండొచ్చని గుసగుస. దీని తర్వాత ముఖ్యమంత్రి పంచతంత్రాల్లో ఐదోవది .. వారాహి. పవన్ కల్యాణ్ నిర్వహించే బస్సు యాత్రే పంచతంత్రాల్లో అతి ముఖ్యమైంది. వచ్చే ఏడాది తర్వాత ప్రారంభించి ఎన్నికల వరకు బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ పంచ తంత్రాలను ఫాలో అయితే పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. మరి జనసేన పంచతంత్రాలు ఎంత వరకు పార్టీకి ఉపయోగపడతాయి.. అధికారంలోకి ఎలా తీసుకువస్తాయో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

Reporter: Vikram

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!