AP CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పార్టీ నేత అరుదైన కానుక.. ఏంటో చూస్తే వావ్ అంటారు..
AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాధ్.
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాధ్. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణులను పిలిపించి 418 కేజీల వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి నమూనాను చేయించారు. పూర్తిగా సిద్ధం చేసిన సీఎం జగన్ నమూనాను ఇవాళ నెల్లూరులోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్.. అందరికంటే భిన్నంగా ఉండేలా వెండి పట్టీలతో సీఎం ప్రతిబింబాన్ని రూపొందించామని తెలిపారు. తమకు దైవ సమానమైన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఇది చేశామన్నారు.
ద్వారకా నాథ్ గతంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. అయితే, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాదయ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ద్వారకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏం చేయాలో తనకు తెలుసునని, అది తన బాధ్యత అని పార్టీ శ్రేణుల ముందు బహిరంగ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇప్పుడు నుడా చైర్మన్గా ద్వారకా నాథ్ను సీఎం జగన్ ఎంపిక చేశారు. నుడా చైర్మన్ పోటీలో ఎందరు ఉన్నా.. వారందరినీ కాదని ద్వారకాకే పదవి కట్టబెట్టారు. దీంతో సీఎం జగన్పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా ప్రత్యేక కార్యక్రమంతో చూపించారు ద్వారకా.
Also read:
ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక్కసారిగా బిల్డింగ్పై కుప్పకూలిన విమానం.. వీడియో
Samantha: సమంత నుంచి ఇలాంటి కామెంట్స్ ఎవరూ ఊహించి ఉండరు.. వీడియో
Know This: ఈ చిన్ని ద్వీపంలో రాజు, మరో 11 మందే ఉంటారు.. వీడియో