Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది.

Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..
Branded Liquor Sell Soon
Follow us

|

Updated on: Dec 31, 2021 | 5:36 PM

Branded liquor in AP: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్లు తెలిపింది. బార్లు, వాక్‌ ఇన్‌ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ట్యాక్స్‌ పేయర్లు పండుగ చేసుకుంటున్నారు. అసలు సిసలు న్యూ ఇయర్ గిఫ్ట్‌ అంటే ఇదే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో బ్రాండెడ్‌ మద్యం అందుబాటులోకి రాబోతోందని తెలిసి ఇప్పటి నుంచి సంబరాలకు రెడీ అవుతున్నారు.

మరికొన్ని గంటల్లో ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ చేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఆనందం మరింత రెట్టింపు కాబోతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు బ్రేకులేసేందుకు ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రాండెడ్‌ మద్యంను అందుబాటులోకి తేబోతోంది.

ఇవి కూడా చదవండి: Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..