AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Crime: నెల్లూరులో దారుణం..! ఉయ్యాలలో మాయమై నదిలో శవమై తేలిన పసిబిడ్డ

ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట తల్లి పక్కనే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఏడాదిన్నర పసిబిడ్డను దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి లేచి చూసేసరికి ఉయ్యాలలో పాప బదులు రెండు బొమ్మలు కనిపించడంతో తల్లి షాక్‌కు గురైంది. చుట్టుపక్కలా..

Nellore Crime: నెల్లూరులో దారుణం..! ఉయ్యాలలో మాయమై నదిలో శవమై తేలిన పసిబిడ్డ
Nellore Crime
Srilakshmi C
|

Updated on: Apr 05, 2023 | 11:43 AM

Share

ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట తల్లి పక్కనే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఏడాదిన్నర పసిబిడ్డను దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి లేచి చూసేసరికి ఉయ్యాలలో పాప బదులు రెండు బొమ్మలు కనిపించడంతో తల్లి షాక్‌కు గురైంది. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన పాప నదిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా ఆదిత్య నగర్ గుర్రాలమడుగు సంఘం నివాసి అనూషకు రాపూరు వాసి మణికంఠతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కృతిక, లక్ష్మీ హారికలు కుమార్తెలు. భర్త మణికంఠ రాపూరులో హోటల్ నిర్వహిస్తుండగా, అనూష ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటోంది. భర్త మణికంఠ రాపూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి వెళుతుంటాడు. ఆదివారం అనూష తల్లి రాపూరులోని అల్లుడు వద్దకు వెళ్లడంతో ఇద్దరు బిడ్డలతో అనూష పిన్ని ఇంటికి వెళ్లింది. ఏడాదిన్నర బిడ్డ అయిన హారికను ఉయ్యాలలో వేసి, పెద్ద కుమార్తె కృతికతో మంచంపై నిద్రించింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో అనూష లేచి చూడగా ఊయలలో బిడ్డ నిద్రపోతోంది. ఇంతలో కరెంట్‌ పోవడంతో తలుపులు తీసి పడుకుంది.

తెల్లారి నిద్రలేచి చూడగా బిడ్డకు బదులు ఊయలలో రెండు బొమ్మలు కనిపించాయి. బిడ్డ కనిపించకపోవడంతో తల్ల అనూష తల్లడిల్లిపోయింది. భర్త, తల్లికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారి హారిక మృతదేహం సర్వేపల్లి కాలువలో లభ్యం అయ్యింది. బోసినవ్వులు చిందిస్తూ ఇంట్లో సందడి చేసిన తమ పాపాయి విగతజీవిగా తేలడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. మరోవైపు ఈ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రక్తసంబంధికులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..