కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సెల్ ఫోన్ చార్జర్ వైర్‌తో గొంతు బిగించి హత్య!

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో దారుణం జరిగింది. నడింపల్లి లో కన్న కూతుర్ని తండ్రే హతమార్చాడు.మద్యం మత్తులో 14 ఏళ్ల కూతురు గౌతమి గొంతుకు సెల్ఫోన్ ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేసాడు. నడింపల్లి కి చెందిన మునిరత్నం ఈ దారుణానికి పాల్పడ్డాడు. .11 ఏళ్ల క్రితమే భార్య ను కూడా చంపినట్లు పోలీసుల..

కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సెల్ ఫోన్ చార్జర్ వైర్‌తో గొంతు బిగించి హత్య!
Murder
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 30, 2024 | 3:17 PM

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో దారుణం జరిగింది. నడింపల్లి లో కన్న కూతుర్ని తండ్రే హతమార్చాడు.మద్యం మత్తులో 14 ఏళ్ల కూతురు గౌతమి గొంతుకు సెల్ఫోన్ ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేసాడు. నడింపల్లి కి చెందిన మునిరత్నం ఈ దారుణానికి పాల్పడ్డాడు. .11 ఏళ్ల క్రితమే భార్య ను కూడా చంపినట్లు పోలీసుల ముందు మునిరత్నం అంగీకరించగా ఇప్పటిదాకా నాన్నమ్మ ఆలనా పాలనలో పెరిగిన గౌతమి నిన్న సాయంత్రం తండ్రి చేతిలోనే హత్యకు గురైంది. సరిగ్గా కళ్ళు కనిపించని నాన్నమ్మ సంరక్షణలో ఉంటూ నడింపల్లి ప్రభుత్వ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న గౌతమి తల్లి లేని బిడ్డగా అందరి ఆదరణ పొందింది.

నిన్న సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రి మునిరత్నం కూతురు గౌతమి తో గొడవ పడ్డాడు. ఇంట్లో పనులు చేయలేదని కూతురు గౌతమిని తిట్టి ఆపై కొట్టి సెల్ ఫోన్ చార్జింగ్ వైర్ తో గొంతు బిగించాడు. మద్యం మత్తులో మునిరత్నం పైశాచికత్వంతో గౌతమీ ఊపిరాడక చనిపోయింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో గౌతమి ని హతమార్చిన మునిరత్నం గుట్టుచప్పుడు కాకుండా కూతురు దహన క్రియలు చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకుని

అడ్డుకున్న గ్రామస్తులు

మునిరత్నంకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గౌతమి డెడ్ బాడీని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల చేత చావు దెబ్బలు తిన్న మునిరత్నంనుఅరెస్టు చేసిన పోలీసులు.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి