AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..

మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్‎పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు.

మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..
Mla Raghurama Krishnamraju
T Nagaraju
| Edited By: Srikar T|

Updated on: Jul 12, 2024 | 1:36 PM

Share

మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్‎పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు. అనంతరం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా వైద్య పరీక్షలు చేసేందుకు హైదరాబాద్‎లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అనంతరం సుప్రీం కోర్టులో రఘురామక్రిష్ణం రాజుకు ఊరట లభించింది.

అయితే హైదరాబాద్‎లో అరెస్ట్ చేసినప్పటి నుండి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని.. తనను హత్య చేసే ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఫైల్ చేశారు. అలాగే పోలీసులు టార్చర్ చేశారంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు లేఖపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్‎, విజయ్ పాల్‎తో పాటూ మరికొంతమంది అధికారులపై కేసు పెట్టారు. సిఐడి అధికారులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?