AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్

ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి చెందిన కారును దొంగలించి హైదరాబాద్ వెళ్లిన రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఎన్ఆర్ఐ అగ్రిటెక్‌లో డ్రైవర్‌గా పనిచేసిన రాంప్రసాద్, పని లేమితో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చి ఉద్యోగం కోరాడు. వారు ఇప్పుడేం ఖాళీ లేదు.. తర్వాత చూద్దామన్నారు..

Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
Accused With Police
T Nagaraju
| Edited By: |

Updated on: May 31, 2025 | 11:31 AM

Share

ఏపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి చెందిన కారును దొంగలించి హైదరాబాద్ వెళ్లిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురంకు చెందిన రాంప్రసాద్ రెడ్డి 2009 నుంచి 2014 వరకూ ఎమ్మెల్సీకి చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ఓలా కారు డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే గత కొంతకాలంగా పని లేకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్దాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మే 28వ తేదిన గుంటూరు వచ్చాడు.

విద్యానగర్‌లోని ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ కంపెనీ వైఎస్ ఛైర్మన్ కాకుమాను సాంబశివరావును కలిశాడు. తనకు ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నాడు. అయితే ప్రస్తుతం ఖాళీ లేదని కొంతకాలం పోయిన తర్వాత చూద్దామని సాంబశివరావు రాంప్రసాద్ రెడ్డికి చెప్పాడు. అయితే ఇక్కడ రెండు రోజులుండి తర్వాత కడప వెళ్లిపోతానని నమ్మకంగా చెప్పాడు. దీంతో ఆఫీస్‌లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగార్జున ఎన్ఆర్ఐ అగ్రిటెక్‌కు చెందిన ఏపి సీజెడ్ 07 2137 కారును ఆఫీస్ కార్యాలయం పార్కింగ్‌లో పెట్టి తాళం ఆఫీస్‌లో ఇచ్చి వెళ్లిపోయాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత రాం ప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్న తన లవర్‌ను కలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే కారు డ్రైవర్ కారు పార్కింగ్‌లో పెట్టి.. తాళం ఆఫీస్‌లో ఇచ్చిన విషయం గుర్తుకువచ్చింది. వెంటనే కారు తాళం తీసుకున్నాడు. కారు పార్కింగ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే తన వద్ద ఫోన్ లేకపోవడంతో వాచ్ మెన్ ఫోన్ దొంగలించి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి రాం ప్రసాద్ లేకపోవడం కారు మాయం అవ్వటంతో అగ్రిటెక్ కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే శుక్రవారం రాంప్రసాద్ రెడ్డి తిరిగి గుంటూరు వస్తుండగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తన లవర్‌ను కలిసేందుకే హైదరాబాద్ వెళ్లానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు రాంప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!