AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మందుబాబులు ఇది విన్నారా.! 3 రోజులు వైన్స్ బంద్.. కారణమిదే..

మందుబాబులు మీకో షాకింగ్ న్యూస్.. ఇది విన్నాక మీ కిక్కు దిగిపోవడం ఖాయం. అదేంటంటే.? ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: మందుబాబులు ఇది విన్నారా.! 3 రోజులు వైన్స్ బంద్.. కారణమిదే..
Liquor Shops
Ravi Kiran
|

Updated on: Jun 01, 2024 | 11:28 AM

Share

మందుబాబులు మీకో షాకింగ్ న్యూస్.. ఇది విన్నాక మీ కిక్కు దిగిపోవడం ఖాయం. అదేంటంటే.? ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా.. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. అటు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..