AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato farmers: ఛిద్రంగా మారిన టమోటా రైతన్న బ్రతుకు.. వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణలు

కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో రైతులు రవాణా ఖర్చులు రాక లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ

Tomato farmers:  ఛిద్రంగా మారిన టమోటా రైతన్న బ్రతుకు.. వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణలు
Venkata Narayana
|

Updated on: Sep 07, 2021 | 7:54 PM

Share

Kurnool – Pattikonda: కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో రైతులు రవాణా ఖర్చులు రాక లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రైతు సంఘం నాయకులు టమోటా మార్కెట్ కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బయట మార్కెట్లో టమోటాలు కొనడానికి వెళ్ళితే కిలో 20 రూపాయలు ఉన్నాయని పత్తికొండ మార్కెట్లో రైతులను ఎందుకు మోసం చేస్తున్నారని టమోటా మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులును నిలదీశారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు టమోటాలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

కనీసం గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బ్రతికేదని రైతు సంఘం నాయకులు.. అధికారులపైనా, వ్యాపారులపైనా మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం