AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడి కారుపై దుండగుల దాడి.. రోడ్డుపై బైఠాయింపు..

చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కిషోర్ కుమార్‌ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు.

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడి కారుపై దుండగుల దాడి.. రోడ్డుపై బైఠాయింపు..
Shiva Prajapati
|

Updated on: Dec 11, 2020 | 6:00 PM

Share

చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కిషోర్ కుమార్‌ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కురబల కోట మండలం అంగళ్లు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్ వెంట ఉన్న మరో టీడీపీ నేత మధుబాబుకి తీవ్రంగా గాయాలయ్యాయి.

వివరాల్లోకెళితే.. శుక్రవారం నాడు టీడీపీ జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ కలిసి కురబల కోట మండలం అంగళ్లులో టీడీపీ కార్యకర్తను కలిసేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అంగళ్లులో వీరి వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీనీ నేతలకు చెందిన కార్ల అద్దాలు పగిలిపోయాయి. దుండగుల చర్యతో ఆగ్రహానికి గురైన కిశోర్ కుమార్, ఇతర టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు. కాగా, తమపై వైసీపీ మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీకి చెందిన మరో వర్గం నేతలే ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దాడిని తీవ్రంగా ఖండించిన నారా లోకేష్.. ఇదిలాఉండగా, అంగళ్లులో టీడీపీ నేతలపై జరిగిన దాడిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. కిషోర్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. దాడికి బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీదే అని అన్నారు.

Follow Us
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..