Nagababu: ప్రజల కష్టార్జితాన్నిదోచుకుంటోన్న వైసీపీని సాగనంపాల్సిన సమయమొచ్చింది: జనసేన నేత నాగబాబు

Nagababu: ఇటీవల ఏపీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్‌, జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు

Nagababu: ప్రజల కష్టార్జితాన్నిదోచుకుంటోన్న వైసీపీని సాగనంపాల్సిన సమయమొచ్చింది: జనసేన నేత నాగబాబు
Nagababu
Follow us

|

Updated on: Jul 01, 2022 | 5:53 AM

Nagababu: ఇటీవల ఏపీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్‌, జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధుల మళ్లింపు, టీటీడీ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోంచి సొమ్మును తీసుకోవడంపై సాంకేతిక లోపం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 12, 918 గ్రామ పంచాయతీల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15 వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌ అవసరాలు, పిల్లల చదువులు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చులు, భవిష్యత్‌ అవసరాల కోసం నెలవారీ జీతంలో కొంత సొమ్మును పొదుపు చేసుకుంటోన్న ఉద్యోగుల కష్టార్జితం రూ. 800 కోట్ల జీపీఎఫ్‌ నిధులను మళ్లించిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన నేత అభిప్రాయపడ్డారు.

జగన్‌ రెడ్డి మార్కు పాలన ఇది..

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై రూ.8 లక్షల కోట్ల రుణ భారాన్ని ఈ ప్రభుత్వం మోపింది. సర్పంచుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా దోచుకోవడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట. ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ స్థలాలను విక్రయించడం, అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసాను దారి మళ్లిస్తోన్న జగన్‌ రెడ్డి మార్కు పాలనను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ అంధకారమవుతుంది. ఈప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పిలుపునిచ్చారు నాగబాబు.

ఇవి కూడా చదవండి

రిఫండబుల్ డిపాజిట్లు ఏం చేస్తున్నారు?

ఇక ఏపీకే తలమానికంగా భావిస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే భక్తుల నుంచి అద్దె గదుల కోసం వసూలు చేస్తోన్న రిఫండబుల్ డిపాజిట్లను ఏం చేస్తున్నారో టీటీడీ సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్‌ చేశారు. ‘రిఫండబుల్ డిపాజిట్లలో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్మును తిరిగి భక్తులకు చెల్లించడం లేదు. అదేంటి అని అడిగితే బ్యాంకు ఖాతాలకు పంపిస్తామని చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దేవడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తుల రిఫండబుల్‌ డిపాజిట్లలో అద్దెకు పోగా మిగతా సొమ్మును ఏం చేస్తున్నారో టీటీడీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు నాగబాబు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం