Andhra Pradesh: కృష్ణలంక యువకుడి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మర్డర్ చేసింది ఎవరో తేల్చిన పోలీసులు..

పేగు తెంచుకు పుట్టిన వాళ్లంటే తల్లిదండ్రులకు ఎనలేని అభిమానం. వారు పెరిగి పెద్దయి.. ప్రయోజకులు అవుతుంటే తల్లిదండ్రులకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ.. వారు దారితప్పితే. వ్యసనాలు,..

Andhra Pradesh: కృష్ణలంక యువకుడి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మర్డర్ చేసింది ఎవరో తేల్చిన పోలీసులు..
Krishnalanka Murder Case
Follow us

|

Updated on: Feb 08, 2023 | 4:17 PM

పేగు తెంచుకు పుట్టిన వాళ్లంటే తల్లిదండ్రులకు ఎనలేని అభిమానం. వారు పెరిగి పెద్దయి.. ప్రయోజకులు అవుతుంటే తల్లిదండ్రులకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ.. వారు దారితప్పితే. వ్యసనాలు, చెడు తిరుగుళ్లకు బానిసై.. నిత్యం వేధిస్తుంటే.. సరిగ్గా కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కుమారుడి వేధింపులు తట్టుకోలేక ఎవరూ లేని సమయంలో తల్లి.. రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కృష్ణలంక పెద్ద అవుట్ల పల్లి లో కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసింది. నిన్న (మంగళవారం) దీప్ చంద్ అనే యువకుడు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ధీర్ చంద్ ను తల్లే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా అప్పులు చేసి తీర్చాలంటూ ధీర్ చంద్ తల్లితండ్రులను వేధిస్తున్నాడు. కుమారుడి వేధింపులతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఎలాగైనా కుమారుడిని అంతమొందించాలని ప్లాన్ వేశారు. నిన్న తెల్లవారుజామున రోకలిబండ తో ధీర్ చంద్ తలపై మోది హత్య చేశారు.

అనంతరం ఎప్పటిలాగా పొలం పనులకు వెళ్లి వచ్చి తన కొడుకును ఎవరో హతమార్చారంటూ రోదించారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ధీర్ చంద్ తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో కుమారుడిని తానే హతమార్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆత్కూరు పోలీసుల అదుపులో ధీర్ చంద్ తల్లి రామాను ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...