AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలలో అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

Srisailam: మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Srisailam Temple
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 08, 2024 | 3:10 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలలో అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

వీడియో ఇక్కడ చూడండి..

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.