Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు భారీ ఊరట..ఆ కేసు ఎత్తివేత..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఏ కేసు? ఎవరు పవన్‌పై ఫిర్యాదు చేశారు?

Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు భారీ ఊరట..ఆ కేసు ఎత్తివేత..!
Andhra Pradesh Deputy Cm Pawan Kalyan
Follow us
Eswar Chennupalli

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 19, 2024 | 8:59 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్‌పై అభియోగాలను తొలగిస్తూ తాజాగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఎత్తివేతకు గల కారణాలను న్యాయమూర్తి ఆర్. శరత్ బాబు వెల్లడించారు. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ 2023, జులై 29 న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరుగా కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్‌పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. తనపై కేసును కొట్టేయాలంటూ పవన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం వాలంటీర్లను మరోసారి విచారించింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

వారాహి సభలో ..

అప్పట్లో పవన్ వారాహి సభలకు పెద్ద క్రేజ్ ఉండేది. జిల్లాల వారీగా ఆయన వారాహి యాత్రలు చేపట్టే వారు. ఆ క్రమంలో గత ఏడాది 2023, జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వాలంటీర్లు పై కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఇళ్లలో మగవాళ్ళు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్‌‌లా మారారని, ఆ వ్యవస్థపై సరైన జవాబుదారీతనం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.

పవన్‌పై ఫిర్యాదు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు

వాలంటీర్లుపై పవన్ కామెంట్స్, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు..వీటి ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వమే డైరెక్ట్ చేయడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ పై అప్పట్లో 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తాజాగా పవన్ హైకోర్టును ఆశ్రయించడం, తిరిగి ఫిర్యాదు చేసిన వాలంటీర్లను కోర్టు విచారించడం, అందులో చేసిన సంతకాలు మావి కాదంటూ ఆ వాలంటీర్లు చెప్పడంతో పవన్‌పై కేసు ఎత్తివేస్తున్నట్టు న్యాయమూర్తి శరత్ బాబు తీర్పు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఇది కదా దయాగాడి దండయాత్ర..
ఇది కదా దయాగాడి దండయాత్ర..
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే