Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం.. బాలికపై పది మంది యువకుల గ్యాంగ్ రేప్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వరసగా జరుగుతున్న అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. విజయవాడ, రేపల్లె ఘటనలు మరవకముందే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, దాడులు...

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం.. బాలికపై పది మంది యువకుల గ్యాంగ్ రేప్
Girl Harassment
Follow us

|

Updated on: May 12, 2022 | 10:32 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వరసగా జరుగుతున్న అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. విజయవాడ, రేపల్లె ఘటనలు మరవకముందే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ఆర్(YSR) లో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో ఓ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిపి 10 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా పదే పదే అత్యాచారం చేయడంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం పోలీసులకు తెలిసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఘటనపై కనీసం కేసు నమోదు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం మసీదు వద్ద ఓ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఆమె తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. అదే వీధిలో ఓ దుకాణంలో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు ఆ బాలికపై కన్నేశాడు. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాలిక చెప్పిన సమాచారాన్ని పోలీసులు వీడియో తీసి, సీఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సదరు సీఐ.. ఈ విషయం బయటకు రాకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులూ కేసు నమోదు చేయకుండా, బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు తరలించారు.

పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను పట్టుకోకుండా బాధితురాలిని స్వచ్ఛంద సంస్థకు తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. స్థానికుల నుంచి బాలికపై అత్యాచార ఘటన తమ దృష్టికి వచ్చిందన్న ప్రొద్దూటూరు డీఎస్పీ.. విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Viral Video: కలెక్టరేట్‌‌లో ఒక్కసారిగా గందరగోళం.. ఏం జరిగిందని చూడగా షాకింగ్ సీన్!

HUL: వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు బ్రిడ్జ్‌ ప్యాక్‌ విధానాన్ని అమలు చేయనున్న హెచ్‌యూఎల్‌..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..