AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perni Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ చేయాలి.. పుస్తకంలో ఆ పేర్లు ఎందుకు రాయలేదు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నేతలు తీసుకువచ్చిన 'జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్..

Perni Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ చేయాలి.. పుస్తకంలో ఆ పేర్లు ఎందుకు రాయలేదు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్..
Perni Nani
Ganesh Mudavath
|

Updated on: Feb 11, 2023 | 5:17 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నేతలు తీసుకువచ్చిన ‘జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై విషపురాతలు రాసి జగనాసుర అనే పేరు పెట్టారని ఫైర్ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదని విమర్శించారు. అసలు జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు గానీ.. చంద్రబాబు పేరు గానీ లేవని, ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాయతీ ఉంటే పేరు వెయ్యాలి కదా అని ప్రశ్నించారు. వైఎస్.వివేకా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు విచారించలేదని నిలదీశారు. అసలు వివేకా కేసులో అప్పటి ప్రభుత్వం ఎందుకు చార్జ్ షీట్ వెయ్యలేదన్న పేర్ని నాని.. ఎన్టీఆర్ చనిపోయినప్పడు కనీసం సీబీసీఐడి విచారణకు కూడా బాబు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదు. టీడీపీ ప్రభుత్వం విచారణ ఎందుకు చెయ్యలేదు. కోడెల మరణంపై పుస్తకం ఎందుకు వెయ్యలేదు. చంద్రబాబు అవమానాలు భరించలేక చనిపోతున్నానని కోడెల చెప్పారా. ఎన్టీఆర్ కుమార్తె మరణంపై కూడా పుస్తకం వేసి సీబీఐకి విచారణకు ఇవ్వాలి. ఎన్టీఆర్ పైనే కుట్ర పన్ని నాశనం చేశారు. ఎన్టీఆర్ కు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనే దానిపై కూడా విచారణ చేయాలి.

       – పేర్ని నాని, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

లోకేశ్ కు కనీసం ఆంధ్రప్రదేశ్ అని కూడా సరిగ్గా రాయడం తెలియదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలని లోకేశ్ కు సూచించారు.  లోకేశ్ యాత్ర జరుగుతున్న సమయంలో గవర్నర్ ను కలవడం ఎందుకని ప్రశ్నించారు. జీఓ నంబర్ ఒకటి ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. గ్రౌండ్ లో సభలు పెట్టుకుంటే ఎవరూ కాదనరని, రోడ్లపై పెడితేనే ఇబ్బంది కలుగుతోందన్నారు. పాదయాత్రకు ప్రజలు రాక.. కర్ణాటక నుంచి కిరాయికి తెచ్చుకుంటున్నారని ఘాటు గా రెస్పాండ్ అయ్యారు పేర్ని నాని.

మరిన్ని ఏపీ వార్తల కోసం..  క్లిక్ చేయండి

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!