AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వన్య ప్రాణిని చంపి, దహనం చేసిన రైతులు! చనిపోయిన ఆ వన్య ప్రాణి ఏమిటో.. చంపిందెవరో?

అది నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల ముఖద్వారంగా పేరు గాంచిన వెల్తుర్ధి మండలం పిచ్చంబావి తండా దగ్గర అటవీ ప్రాంతం మొదలైన చోట కాలిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పారెస్ట్ లో ఏదో జంతువును కాల్చి వేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏం జరిగి ఉంటుందో అన్న అంశంపై విచారణ ప్రారంభించారు. అయితే అసలేం జరిగిందో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే వెల్తుర్ది మండలం పిచ్చంబావి తండా వద్ద..

Andhra Pradesh: వన్య ప్రాణిని చంపి, దహనం చేసిన రైతులు! చనిపోయిన ఆ వన్య ప్రాణి ఏమిటో.. చంపిందెవరో?
Farmers Burnt A Wild Animal
T Nagaraju
| Edited By: Srilakshmi C|

Updated on: Dec 20, 2023 | 10:45 AM

Share

వెల్తుర్ది, డిసెంబర్‌ 20: అది నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల ముఖద్వారంగా పేరు గాంచిన వెల్తుర్ధి మండలం పిచ్చంబావి తండా దగ్గర అటవీ ప్రాంతం మొదలైన చోట కాలిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పారెస్ట్ లో ఏదో జంతువును కాల్చి వేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏం జరిగి ఉంటుందో అన్న అంశంపై విచారణ ప్రారంభించారు. అయితే అసలేం జరిగిందో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే వెల్తుర్ది మండలం పిచ్చంబావి తండా వద్ద ఫారెస్ట్ భూమిని కొంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు తరుచూ పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. దీంతో రైతుల పంటలపై వన్య ప్రాణులు దాడులు చేయకుండా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే విద్యుత్ కంచెలకు తగిలి అటవీ జంతువు మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన రైతులు గుట్టుచప్పుడు కాకుండా వన్య ప్రాణిని అటవీ ప్రాంతంలో కాల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే రైతులు అంతగా భయపడటానికి ప్రధానం కారణమైన ఆ జంతువు ఏంటా అన్న భావన వ్యక్తం అవుతోంది. చిరుత లేదా పెద్ద పులి మరణించి ఉండటంతోనే ఆందోళనకు చెందిన రైతులు తమపై కేసు నమోదు కాకుండా తగలబెట్టి ఉంటారన్న నమ్మకం బలపడుతుంది.

గతంలో పల్నాడు జిల్లాలోని దుర్గి మండలంలో రెండు పెద్ద పులలు సంచరించి కలకలం రేపాయి. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోవడంతో గ్రామ సరిహద్దులోకి వచ్చి ఉంటాయని అధికారులు భావించారు. అంతేకాకుండా గజాపురం పెద్ద పెద్ద పులులు ఆవుపై కూడా దాడి చేశాయి. అటు తర్వాత ఆ రెండు పులలు కూడా నలమల డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తేల్చి చెప్పారు. వేసవి ముగిసిన తర్వాత రెండు పులల జాడలు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే పిచ్చంబావి తండా వద్ద గుర్తు తెలియని జంతువు కాల్చి వేశారన్న ప్రచారం తిరిగి పులలు జాడపై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అయితే పూర్తిగా కాలిపోయిన ప్రాంతంలో దొరికిన ఎముకులను అటవీ అధికారులు పోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ జంతువు ఏంటి అనే అంశంపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ తర్వాతే జంతువును కాల్చివేసిన దుండగులను కూడా కనిపెట్టే అవకాశం ఉందంటున్నారు. అటవీ శాఖాధికారులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగెలను అక్రమంగా ఏర్పాటు చేసి జంతువు మ్రుతికి కారణమయ్యారంటూ కేసులు పెడతారన్న భయంతోనే రైతులు జంతువును కాల్చి వేసి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..