Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్

మనుషుల  మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. చిన్న, చిన్న కారణాలకే మితిమీరిన కోపం వచ్చేస్తుంది. క్షణికావేశం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. బంధాలను, బంధుత్వాలు కూడా కనుమరుగు అవుతున్నాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్
Follow us

|

Updated on: Feb 26, 2021 | 1:47 PM

మనుషుల  మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. చిన్న, చిన్న కారణాలకే మితిమీరిన కోపం వచ్చేస్తుంది. క్షణికావేశం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. బంధాలను, బంధుత్వాలు కూడా కనుమరుగు అవుతున్నాయి. ఆస్తి కోసం హత్యలు జరగడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవహారాల్లో తేడావస్తే.. ఆప్త మిత్రులను కూడా విడవడం లేదు. ఇక అక్రమ సంబంధాల వల్ల.. జరుగుతున్న క్రైమ్స్ అన్నీ, ఇన్నీ కావు. రోజూ ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. లేనిపోని మోహాల్లో పడి కొందరు బిడ్డల జీవితాలతో పాటు తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. 2017-2019 మధ్య మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,859 హత్యకేసులు నమోదయ్యాయి. వీటిలో 1,660 (58.60 శాతం) ఘటనలకు వివాదాలు, అక్రమ సంబంధాలే కారణమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే.. బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వారే.

అయినవాళ్లనే అంతమొందిస్తున్నారు…

2017-19 మధ్య వివాదాల వల్ల 1,139 మంది హత్యలకు గురయ్యారు. నగదు లావాదేవీల్లో తలెత్తిన విభేదాలు, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, చిన్నచిన్న గొడవల్లో ప్రత్యర్థులు వారిని హతమార్చారని రిపోర్ట్ చెబుతోంది. వీరిలో 492 మంది (43.19 శాతం) కుటుంబ వివాదాల వల్లే ప్రాణాలు పోగొట్టుకున్నారు.  పలు ఘటనల్లో హతులు, హంతకులు ఒక ఫ్యామిలీకి చెందినవారే ఉంటున్నారు. ఆర్థిక పరమైన విబేదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు చెబుతున్న విషయం. ముఖ్యంగా అన్నదమ్ములు, ఒకే పేగు పంచుకు పుట్టిన వారి మధ్య ఇలాంటి విభేదాలు అధికమని నిపుణులు చెబుతున్నారు.

సమాజానికి పెను ప్రమాదంగా అక్రమ  సంబంధాలు…

 వివాహేతర సంబంధాల వల్ల మూడేళ్లలో 521 మంది హత్య గావించబడ్డారు. ఏటా ఈ ఒక్క కారణంతో సగటున 17-18 శాతం హత్యలు జరుగడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. వివాహేతర సంబంధానికి  అడ్డుగా ఉన్న భాగస్వామిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, తమ దాంపత్య జీవితంలోకి ప్రవేశించి కుటుంబంలో కలహాలు రేపుతున్నారన్న కారణంతో మరికొందరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు. భాగస్వాములకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనూ హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అంతమవుతున్న వారిలో ఎక్కువమంది 18-30 ఏళ్లకు చెందినవారే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

మార్పు రావాలి…

మన కుటుంబ వ్యవస్థ రోజురోజుకు కలుషితం అవుతున్నది అన్నది ఈ నివేదికలు చెబుతున్న అంశం. మారాలి.. మార్పు రావాలి. కుటుంబ వ్యవస్థ, విలువల అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. అందునా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కుటుంబాలు, అనుబంధాలకు మంచి పేరు ఉంది. భవిష్యత్ తరాలను ఆ వారసత్వం అందించకపోతే.. పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

ALSO READ: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..

ALSO READ: ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..