ఆ సీటు విషయంలో కొనసాగుతున్న మీమాంస.. కూటమిలో గందరగోళం..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోందా.? టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తోన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో ఆశలు సన్నగిల్లుతున్నాయా..? బీజేపీలో జాయిన్ కావాలని పురందేశ్వరి, చేరమని చంద్రబాబు నల్లమిల్లికి సలహా ఇచ్చారా.? ఇంతకీ.. నల్లమిల్లి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.? అనుచరుల ఆదేశాలతో ఇండిపెండెంట్గా బరిలో దిగడం ఖాయమా?
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోందా.? టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తోన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో ఆశలు సన్నగిల్లుతున్నాయా..? బీజేపీలో జాయిన్ కావాలని పురందేశ్వరి, చేరమని చంద్రబాబు నల్లమిల్లికి సలహా ఇచ్చారా.? ఇంతకీ.. నల్లమిల్లి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.? అనుచరుల ఆదేశాలతో ఇండిపెండెంట్గా బరిలో దిగడం ఖాయమా?
ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు దూకుడు పెంచారు. వైసీపీ, కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే.. కూటమికి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల వ్యవహారం కాకరేపుతోంది. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జనసేన పార్టీ సీట్లు సర్దుబాటు పూర్తి కాగా.. అభ్యర్థులందరికీ పవన్కళ్యాణ్ బీ ఫామ్స్ ఇవ్వడం, కొందరు నామినేషన్స్ వేయడం జరుగుతోంది. కానీ.. టీడీపీ, బీజేపీ మధ్య మాత్రం కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రావడంలేదు. ముఖ్యంగా.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. అనపర్తి రాజకీయం కూడా ఉండి పొలిటికల్ డ్రామాకి మించిపోతోంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో అనపర్తి క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోంది.
ఇదిలావుంటే.. బీజేపీలో చేరాలంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఆ పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తమ పార్టీలో చేరితే అనపర్తి సీటు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అటు.. కొందరు టీడీపీ ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరాల్సిందిగా రెండు రోజులుగా రామకృష్ణారెడ్డితో ఫోన్లో మంతనాలు చేస్తున్నారు. కానీ.. అనపర్తిలో పార్టీని కాపాడడానికి టీడీపీ నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పోటీ చేస్తే టీడీపీ నుంచే.. లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, అనుచరులతోనూ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా గెలిపించుకుంటామని రామకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు టీడీపీ కార్యకర్తలు, అనుచరులు.
వాస్తవానికి.. మొదటి లిస్ట్లోనే అనపర్తి అభ్యర్ధిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించినా.. బీజేపీతో పొత్తు తర్వాత రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడంతో రచ్చ కొనసాగుతోంది. నల్లమిల్లి మూడు వారాలుగా చేసిన న్యాయపోరాటం కూటమిలో కల్లోలం రేపింది. చివరికి.. చంద్రబాబు, పురంధేశ్వరి నుంచి నల్లమిల్లికి పిలుపురావడంతో అనపర్తి మళ్లీ టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. టికెట్ మార్పు ఉంటుందనే పురందేశ్వరి, చంద్రబాబు సంకేతాల నేపథ్యంలో కూటమి అభ్యర్థిని తానేనని నల్లమిల్లి ప్రచారం చేసుకుంటున్నారు. దాంతోపాటు.. నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ కూడా వేయడం ఆసక్తిగా మారుతోంది. అయితే.. కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణంరాజును ప్రకటించినప్పటికీ.. ఇంకా నామినేషన్ వేయకపోవడం చర్చకు తావిస్తోంది. మొత్తంగా.. అనపర్తిలో కూటమి పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన చెప్పినట్లుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారా.. రాజకీయాలు మారితే.. బీజేపీ నుంచి బరిలో దిగుతారా.. లేక అనుచరుల కోరిక మేరకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…