AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఏపీలో భారీ మోసం.. బ్యాంకు మేనేజర్‌తో కలిసి కోట్లకు కోట్లే..

వాళ్లంతా సమాజంలో పెద్దమనుషులు, పైకి జెంటిన్‌మెన్స్‌లా కనిపిస్తారు, కానీ తెర వెనక పెద్దపెద్ద స్కామ్స్‌ చేస్తారు. గుంటూరులో అలాంటి మోసమే ఒకటి జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ కేటుగాళ్లకు షాకిచ్చింది ఈడీ

Andhra Pradesh: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఏపీలో భారీ మోసం.. బ్యాంకు మేనేజర్‌తో కలిసి కోట్లకు కోట్లే..
Kisan Credit Card
Shaik Madar Saheb
|

Updated on: Jan 03, 2023 | 8:11 AM

Share

వ్యవస్థలో ఉండే లూప్‌ హోల్సే మోసగాళ్లకు ఆయుధం. మోసగాళ్లకు అక్కమార్కులు తోడైతే భారీ స్కామే. ప్రజా ధనాన్ని కోట్లకు కోట్లకు ఈజీ కొట్టేస్తారు. గుంటూరులో అదే జరిగింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూనే కోట్ల రూపాయలు దోచేశారు. రైతుల పేరుతో ఈ దోపిడీకి పాల్పడ్డారు కేటుగాళ్లు. కిసాన్ క్రెడిట్ కార్డులంటూ గుంటూరు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకుని లూటీ చేశారు. ఇందుకోసం 247మంది అమాయక రైతుల పేర్లను వాడుకున్నారు. రైతుల పేరుతో ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంతో ఈ ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్‌ అధికారుల కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన ఈడీ, మోసగాళ్లు మాడ సుబ్రమణ్యం. మాడ శ్రీనివాసరావు, గండూరి మల్లికార్జునరావు, ఏలూరి ప్రసాదరావుపై కేసులు నమోదుచేసింది.

ఇన్వెస్టిగేషన్‌ తర్వాత 20కోట్ల 31లక్షల రూపాయల స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. ఈ నలుగురు నిందితుల కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం అటాచ్‌ చేసింది ఈడీ. ఈ ఫ్రాడ్‌పై మొత్తం నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈ మోసగాళ్లకు ఐడీబీఐ బ్యాంకు అధికారులు సహకరించినట్టు గుర్తించింది ఈడీ. ఐడీబీఐ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌ హరీష్‌ వీళ్లతో కుమ్మక్కైనట్టు దర్యాప్తులో తేలింది.

247మంది రైతుల పేరిట మొత్తం 57కోట్ల 10లక్షల రూపాయల రుణాలను మంజూరు చేశారు అప్పటి గుంటూరు ఐడీబీఐ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌. ఈ డబ్బుతో నిందితులు స్థిరాస్థులు కొనుగోలు చేశారని చెప్పింది ఈడీ. అలా కొనుగోలు చేసిన ఆస్తులనే ఇప్పుడు అటాచ్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..