AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: ఏపీకి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.. తొలి విడతగా 4.96 లక్షల కరోనా టీకాల పంపిణీ..

Covid Vaccine: కరోనా టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. తొలివిడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ

Covid Vaccine: ఏపీకి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.. తొలి విడతగా 4.96 లక్షల కరోనా టీకాల పంపిణీ..
uppula Raju
|

Updated on: Jan 12, 2021 | 2:33 PM

Share

Covid Vaccine: కరోనా టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. తొలివిడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. చైల్డ్, హెల్త్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ శ్రీహరి, టీకా కేంద్రం ఇంచార్జి దేవానందం, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు ఏర్పాట్లను పరిశీలించారు.

దీంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 4.96 లక్షల కరోనా టీకాలు వచ్చాయని అధికారులు తెలిపారు. మొదటగా చిత్తూరు జిల్లాలో మొత్తం 35206 మందికి తొలివిడతలో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై అధికారులతో సమావేశమయ్యారు. మెడికల్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ వచ్చాక భద్రప్రచేందుకు తిరుపతి రూయా ఆసుపత్రిలో ఐస్ లైన్ రిఫ్రజిరేటర్లని సిద్ధం చేశారు. రుయా నుంచి ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు తరలిస్తారు.

రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు షురూ.. ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్న అధికారులు.. పేర్లు నమోదుకు అవకాశం..!

వారం రోజుల్లో 70 లక్షల మంది తొలిడోసు.. తెలంగాణకు కోటిన్నర టీకాలు… ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం