AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వైసీపీ.. తొలి బహిరంగ సభ అక్కడి నుంచే..

అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్‌ రెడీ అయింది. 175కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్‌.. భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది.

CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వైసీపీ.. తొలి బహిరంగ సభ అక్కడి నుంచే..
CM Jagan
Srikar T
|

Updated on: Jan 19, 2024 | 6:34 AM

Share

విశాఖపట్నం, జనవరి 19: అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్‌ రెడీ అయింది. 175కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్‌.. భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న సీఎం జగన్‌ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి నియోజవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారన్నారు.

సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలకు ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారని.. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతాయన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారన్నారు. పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరించి చెబుతున్నారన్నారు వైవీ. మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసుకుని ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతోంటే.. ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?