AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM jagan: ఏపీలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. నేరుగా ఖాతాల్లోకి నగదు జమ

AP news: తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

CM jagan: ఏపీలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. నేరుగా ఖాతాల్లోకి నగదు జమ
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: May 05, 2022 | 1:45 PM

Share

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన పథకంతో విద్యార్థుల చదువుల విషయంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పేదరికం నుంచి బయటపడే శక్తి చదువుకు ఉందని సీఎం అన్నారు. తిరుపతిలో జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. 709 కోట్ల రూపాయలను 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.  జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద గడిచిన రెండేళ్ల కాలంలో 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల చదువులపై చేస్తున్న ఖర్చు పెట్టుబడి మాత్రమేనని తెలిపారు. పిల్లలు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దని టీడీపీ అంటోందని సీఎం అన్నారు.

ప్రశ్నపత్రాలు లీకేజీ వెనుక ఉన్నది నారాయణ స్కూల్స్‌, చైతన్య స్కూల్స్‌ అని సీఎం జగన్ అన్నారు. ఒక వ్యవస్థను నాశనం చేసే కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నారాయణ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనల వెనుక ఉన్నది టీడీపీ నాయకులేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాలపై వాళ్లే నానా యాగీ చేస్తున్నారని అన్నారు.

Also Read: Nellore District: డాక్టర్ కాదు రాబందు.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం.. ప్రభుత్వం సీరియస్

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్