AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

TDP Rajya Sabha candidates finalized: ఏపీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరనే సస్పెన్షన్ వీడింది. సుదీర్ఘ చర్చల తర్వాత పార్టీ నుంచి ముగ్గురు నేతల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులుగా చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీస్‌ పేర్లను అధికారికంగా ప్రకటించింది.

Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు
Dp Rajya Sabha Candidates
Anand T
|

Updated on: Jun 06, 2026 | 10:37 PM

Share

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. టీడీపీ నంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమేనని రమేశ్ పేరును ఇటీవలే అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

మరోవైపు టీడీపీ నుంచి ముగ్గురు నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ ఆశావాహులుగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలుస్తున్నారు. వారిలో సూదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ముగ్గురు పేర్లను ఆయన ఖరారు చేశారు. వారిలో చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌ ఉన్నారు. టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఈ ముగ్గురు నేతలే వెళ్లనున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజ్యసభ అభ్యర్థులుగా సోమవారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us