Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 4 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆగస్టు 6న కంప్యూటర్‌ టెస్ట్

ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆగ‌స్టు 6న కంప్యూటర్‌ పరీక్ష జరగనుంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ కృష్ణా యూనివర్సిటీలో పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలో అభ్యర్ధులను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. వారందరూ ప్రొఫెషియన్సీ ఇన్‌ ఆఫీస్‌ ఆటోమేషన్‌ విత్‌ యూసేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ అసోసియేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ పరీక్షకు హాజరుకావాలని..

APPSC Group 4 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆగస్టు 6న కంప్యూటర్‌ టెస్ట్
APPSC Group 4 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 04, 2023 | 9:01 PM

అమరావతి, జులై 28: ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆగ‌స్టు 6న కంప్యూటర్‌ పరీక్ష జరగనుంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ కృష్ణా యూనివర్సిటీలో పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలో అభ్యర్ధులను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. వారందరూ ప్రొఫెషియన్సీ ఇన్‌ ఆఫీస్‌ ఆటోమేషన్‌ విత్‌ యూసేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ అసోసియేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. కంప్యూటర్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఆగస్టు 6వ తేదీన ఉదయం 10 గంటలకు యూనివర్సిలోని పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ పరీక్షకు తప్పనిసరిగా హాల్‌టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని వివరించారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ ఏపీపీఎస్సీ నోటిషికేషన్‌లో పొందుపర్చారన్నారు.

కాగా గ్రూప్‌-4 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరయ్యారు. వీరిలో 11,574 మంది మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. వారందరికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో దాదాపు 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదలు ఇటీవల విడుదలయ్యాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారందరికీ ఇప్పుడు కంప్యూటర్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగ‌స్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. నీట్‌ యూజీ-2023 అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.